సికింద్రాబాద్లో మంత్రి కేటీఆర్ పర్యటన
ABN , First Publish Date - 2022-03-03T18:09:26+05:30 IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది.
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. పర్యటలో భాగంగా ఓల్డ్ మారేడ్పల్లిలో 5 ఎకరాల్లో జీహెచ్ఎంసీ నిర్మించిన 468 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని, మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్, డిప్యూటి మేయర్ పాల్గొన్నారు.