కైతలాపూర్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి KTR
ABN , First Publish Date - 2022-06-21T16:45:47+05:30 IST
నగరంలోని ఐటీ కారిడార్లో కొత్త ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
హైదరాబాద్: నగరంలోని ఐటీ కారిడార్లో కొత్త ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మంగళవారం ఉదయం కైతలాపూర్ ఫ్లైఓవర్(Kaithalapur flyover)ను మంత్రి కేటీఆర్ (KTR) ప్రారంభించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని రూ.86 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ చేపట్టింది. ఈ ఫ్లైఓర్తో హైటెక్సిటీ నుండి కూకట్పల్లి వరకు, జేఎన్టీయూ నుండి హైటెక్ సిటీ వెళ్ళే వారికి ట్రాఫిక్ భారం తగ్గనుంది. సనత్నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 3.50 కిలో మీటర్ల ప్రయాణ దూరం తగ్గనుంది.