అభివృద్ధి పనులకు శంకు స్ధాపనలు చేసిన మంత్రి కేటీఆర్

ABN , First Publish Date - 2022-01-29T23:37:57+05:30 IST

పట్టణ ప్రగతిలో భాగంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజి,వైకుంఠ ధామాలు, కాబ్రాస్థాన్, పార్కులు, బస్తీ దవాఖానాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు.

అభివృద్ధి పనులకు శంకు స్ధాపనలు చేసిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా: పట్టణ ప్రగతిలో భాగంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజి,వైకుంఠ ధామాలు, కాబ్రాస్థాన్, పార్కులు, బస్తీ దవాఖానాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు.శనివారం జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా తుక్కుగూడ మునిసిపాలిటీలో 4 కోట్ల 50 లక్షల నిధులతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి, మంచినీటి పైప్‌లైన్‌ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.


అలాగే జిల్లాలోని మాహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ, జల్ పల్లి మునిసిపాలిటీలు, బడoగ్ పేట్,మీర్ పేట్ కార్పొరేషన్ల పరిధిలలో 371 కోట్ల 9 లక్షల రూపాయల వ్యయంతో రక్షిత మంచినీటి పథకాలకు, రహదారుల విస్తరణ పనులకు,వరద నీటి కాలువలు, నాలాల పనులకు, సమీకృత వెజ్ ,నాన్ వెజ్ మార్కెట్ పనులకు కూడా మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు, బడoగ్ పేట్ లో పట్టణప్రాథమిక కేంద్ర భవనాన్ని కూడా మంత్రి కేటీఆర్  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. జల్ పల్లి మునిసిపాలిటీలో 111 కోట్ల 76 లక్షల వ్యయంతో రహదారుల విస్తరణకు, సమీకృత మార్కెట్ నిర్మాణానికి, మంచినీటి పైప్‌లైన్‌ నిర్మాణానికి, డ్రైనేజి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 


అనంతరం జల్ పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తుక్కుగూడ మునిసిపాలిటీలో ఏర్పాటు చేయనున్న సమీకృత మార్కెట్లో కూరగాయలతో పాటు మాంసం విక్రయాలకు సంబంధించి మార్కెట్‌లో సదుపాయాలు కల్పించనున్నామని 108 గదులతో వేర్వేరుగా వెజ్, నాన్‌ వెజ్ బ్లాక్‌లను నిర్మిస్తారు. 78 గదులతో కూరగాయల బ్లాక్, 30 గదులతో మాంసాహార బ్లాక్‌ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. జల్‌పల్లిలో ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లువస్తున్నాయని, త్వరలో జల్‌పల్లిలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తామని, రూ.29 కోట్లతో జల్‌పల్లికి మరో రోడ్డు మంజూరు చేస్తామన్నారు., రాష్ట్రవ్యాప్తంగా 26 వేల స్కూళ్లలో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. 


బడoగ్ పేట్,మీర్ పేట్ కార్పొరేషన్ల పరిధిలలో రక్షిత మంచినీటి పథకాలకు, రహదారుల విస్తరణ పనులకు,వరద నీటి కాలువలు, నాళాల పనులకు, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులకు, మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి, జిల్లా జెడ్పీ చైర్మన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు  మహేందర్ రెడ్డి,  ఎగ్గే మల్లేష్, జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీఎమ్మెల్యే తీగల క్రిష్ణా రెడ్డి, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్,అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, మేయర్, మునిసిపల్ చైర్మన్లు,కౌన్సిలర్లు, కమిషనర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T23:37:57+05:30 IST