మెట్రోరైల్ ప్రాజెక్ట్ పై ఉన్నతస్థాయి సమావేశం

ABN , First Publish Date - 2021-11-26T00:58:30+05:30 IST

గ్రేటర్ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై గురువారం బిఆర్ కె భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

మెట్రోరైల్ ప్రాజెక్ట్ పై ఉన్నతస్థాయి సమావేశం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్  మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై గురువారం బిఆర్ కె  భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామా రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగ రావు, మున్సిపల్ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్థిక  శాఖ  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మెట్రో రైల్ తీరు తెన్నులను వారు చర్చించారు. ప్రస్తుతం మెట్రోరైల్ నష్టాలను ఎదుర్కొంటోందని, గత కొంత కాలంగా అధికారులు ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం నుంచి సాయం చేయాలని కూడా వారు కోరుతున్నారు. ఈ నేపద్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

Updated Date - 2021-11-26T00:58:30+05:30 IST