KTR: విదేశాల్లో ఉంటున్న మనోళ్లకు టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు అండగా ఉండాలి
ABN , First Publish Date - 2022-09-20T12:54:47+05:30 IST
విదేశాల్లో ఉంటున్న మన వారికి టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు అండగా నిలవాలని, ఇబ్బందులేవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉంటున్న మన వారికి టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు అండగా నిలవాలని, ఇబ్బందులేవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు (KTR) పేర్కొన్నారు. సోమవారం తనను కలిసిన టీఆర్ఎస్ ఆస్ర్టేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డితో కేటీఆర్ పలు అంశాలపై చర్చించారు. ఇటీవలికాలంలో సోషల్ మీడియాలో వస్తున్న అబద్ధపు ప్రచారాల గురించి ప్రస్తావిస్తూ.. ఎన్నారైలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు.