బీజేపీ అంటేనే జూటా పార్టీ:మంత్రి Malla reddy
ABN , First Publish Date - 2022-05-27T21:03:44+05:30 IST
బీజేపీ అంటేనే జూటా పార్టీ అని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి(malla reddy) విమర్శించారు. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు.
హన్మకొండ: బీజేపీ అంటేనే జూటా పార్టీ అని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి(malla reddy) విమర్శించారు. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. శుక్రవారం భద్రకాళి(bhadra kali) అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోదీ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. బీజేపీ కౌరవుల నుంచి దేశానికి విముక్తి కల్పించాలని దేవుడిని కోరుకున్నట్టు తెలిపారు.కేసీఆర్ను ప్రధానిని చేయాలని భద్రకాళిని ప్రార్థించానని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
దసరా రోజు భద్రకాళిని కేసీఆర్ దర్శించుకుంటారు.అమ్మవారికి మొక్కి దేశ రాజకీయాల కోసం బయల్దేరుతారని చెప్పారు. కేసీఆర్ దేశ్కీ నేత..ప్రధాని కావాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని మంత్రి మల్లారెడ్డి బీజేపీ పాలిత రాష్ట్రాలకు సవాల్ విసిరారు.తెలంగాణను బీట్ చేసే మొగాడు ఎవరూ లేరు అంటూ కేసీఆర్కు ప్రజలు సంపూర్ణ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.