మంత్రి మల్లారెడ్డికి కరోనా

ABN , First Publish Date - 2020-08-08T21:00:08+05:30 IST

మహమ్మారి కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసింది. జాగ్రత్తలెన్ని తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..

మంత్రి మల్లారెడ్డికి కరోనా

హైదరాబాద్: మహమ్మారి కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసింది. జాగ్రత్తలెన్ని తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..? తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. సామాన్య జనం.. ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులు.. రాజకీయ నాయకులు.. ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. అందరిపై దాడి చేస్తోంది. ఇప్పుడు టీఆర్‌ఎస్ కేబినెట్‌ను కరోనా వణికిస్తోంది. హోం మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా సోకిన విషయం తెలిసింది. అయితే శనివారం మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. మల్లారెడ్డికి కరోనా సోకడంతో ఇటీవల కాలంలో ఆయన కలిసినవారిలో ఆందోళన నెలకొంది.

Updated Date - 2020-08-08T21:00:08+05:30 IST