సైదాబాద్ నిందితుడిని ఎన్కౌంటర్ చేస్తాం: మంత్రి మల్లారెడ్డి
ABN , First Publish Date - 2021-09-15T00:25:41+05:30 IST
నగరంలో సంచలనం సృష్టించిన సైదాబాద్ ఘటనపై మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన సైదాబాద్ ఘటనపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. సైదాబాద్లో చిన్నారిని హత్య చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేస్తామని మల్లారెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి ఈ వాఖ్యలు చేసారు. సైదాబాద్ ఘటన ఘోరమన్నారు. బాధిత కుటుంబానికి సహాయం అందిస్తామన్నారు.