మంత్రి మల్లారెడ్డి కబ్జాకోరు : కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2022-05-26T05:29:30+05:30 IST

మంత్రి మల్లారెడ్డి కబ్జాకోరు : కాంగ్రెస్‌

మంత్రి మల్లారెడ్డి కబ్జాకోరు : కాంగ్రెస్‌
మంత్రి మల్లారెడ్డి గుండ్లపోచంపల్లిలో పార్కు కబ్జా చేసిన ఆధారాలను మీడియాకు చూపుతున్న కాంగ్రెస్‌ నాయకులు

మేడ్చల్‌ అర్బన్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): మంత్రి మల్లారెడ్డి పక్కా భూ కబ్జాకోరు అని కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామానికి నక్ష కూడా చేయించలేని దుర్భర పరిస్థితిలో టీఆర్‌ఎస్‌ సర్కారు ఉండడం విచారకరమని దుయ్యబట్టారు. బుధవారం కీసరలోని జిల్లా ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ కీసర మండల అధ్యక్షుడు కోల కృష్ణయాదవ్‌, నాయకులు తుంగతుర్తి రవి, మల్లెపూల శ్రీకాంత్‌,  రాజేష్‌, సాయిపేట శ్రీనివా్‌సలు మీడియాతో మాట్లాడారు. మేడ్చల్‌ పరిధిలో మంత్రి మల్లారెడ్డితోపాటు వారి కుటుంబసభ్యుల అవినీతి, అక్రమాలు పెచ్చరిల్లాయన్నారు. గ్రామకంఠం, పార్కు, తదితర భూములను కబ్జా చేస్తున్నారన్నారు. ఆధారాలున్నా.. అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గుండ్లపోచంపల్లి కబ్జా వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులపై కేసువేసి, ప్రభుత్వ పార్కు స్థలాన్ని కబ్జా చేశాడన్నారు.  ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పోరాటం చేస్తున్నారని, ఇకముందు ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తామన్నారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన అనుచరులపై క్రిమినల్‌ కేసు నమోదు చేయలని వారు డిమాండ్‌ చేశారు. నిజనిర్ధారణ కమిటీ వేస్తే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

Updated Date - 2022-05-26T05:29:30+05:30 IST