ఎమ్మెల్యే కందాళ కుటుంబానికి టీఆర్ఎస్ నేతల పరామర్శ
ABN , First Publish Date - 2021-05-07T04:31:06+05:30 IST
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డిని పలువురు నేతలు పరామర్శించారు.
కూసుమంచి, మే 6: పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డిని పలువురు నేతలు పరామర్శించారు. రోడ్లు భవనాలశాఖామంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, టీఆర్ఎస్ రాష్ట్రకార్యదర్శి తాతా మధు పరామర్శించారు. సోదరుడు జితేందర్రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను స్వగ్రామం రాజుపేట వెళ్లి పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జితేందర్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పరామర్శించినవారిలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, కాంట్రాక్టర్ ఆర్టీసీ వెంరటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ రూరల్ అధ్యక్షుడు బెల్లం వేణు ఉన్నారు.