డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు మంత్రి మేకపాటికి ఆహ్వానం
ABN , First Publish Date - 2021-03-01T09:32:18+05:30 IST
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) జపాన్లోని టోక్యోలో నిర్వహించనున్న ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సు-2021లో
అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) జపాన్లోని టోక్యోలో నిర్వహించనున్న ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సు-2021లో పాల్గొనాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ ఏడాది ఏప్రిల్ 5 నుంచి 7 వరకు ఈ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ప్రత్యక్షంగా గానీ వర్చువల్గా గానీ నిర్వహించే కార్యక్రమంలో కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ దేశాలు అభివృద్ధి బాటలో సాగేందుకు నూతన సాంకేతికత వినియోగం అనే అంశంపై చర్చ జరగనుంది. దీనికి హాజరు కావాలంటూ ప్రపంచ ఆర్థికవేదిక అధ్యక్షులు బోర్గ్ బ్రండే తనకు లేఖ రాశారని మంత్రి మేకపాటి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.