అందుకే చంద్రబాబును పక్కన పెట్టారు: మంత్రి నాగార్జున

ABN , First Publish Date - 2022-05-29T01:20:20+05:30 IST

చంద్రబాబు క్విట్ జగన్ అంటున్నాడు.. మంచి చేసే జగన్‌ని సాగనంపాలా.. అందుకే చంద్రబాబును ప్రజలు ఓడించి పక్కన కూర్చోబెట్టారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.

అందుకే చంద్రబాబును పక్కన పెట్టారు: మంత్రి  నాగార్జున

పల్నాడు జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు క్విట్ జగన్ అంటున్నాడు.. మంచి చేసే జగన్‌ని సాగనంపాలా.. అందుకే చంద్రబాబును ప్రజలు ఓడించి పక్కన కూర్చోబెట్టారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. శనివారం నరసరావుపేటలో సామాజిక బేరి సభ నిర్వహించారు. ఈసభకు వైసీపీ మంత్రులు , ఎమ్మెల్యే, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు తన పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎప్పుడైనా గౌరవించారా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో పరిపాలనా ఉందా అని చంద్రబాబు అడుగుతున్నాడు. అందుకే పదిహేడు మంది మంత్రులు రాష్ట్రంలో బస్సు యాత్ర చేసి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తున్నారని మంత్రి నాగార్జున అన్నారు.

Updated Date - 2022-05-29T01:20:20+05:30 IST