ఆరోగ్యశ్రీ సిబ్బంది సేవలు ప్రశంసనీయం
ABN , First Publish Date - 2022-05-16T05:25:11+05:30 IST
కొవిడ్ సమయంలో ఆరోగ్యశ్రీ సిబ్బంది అందించిన సేవలు ప్రశంసనీయం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.
మేరుగ నాగార్జున
గుంటూరు(తూర్పు), మే15: కొవిడ్ సమయంలో ఆరోగ్యశ్రీ సిబ్బంది అందించిన సేవలు ప్రశంసనీయం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఏసీ కళాశాల ఎదురుగా ఉన్న అంబేద్కర్ భవన్లో ఆదివారం వైఎస్సార్ ఆరోగ్య టీమ్ లీడర్స్, ఆరోగ్య మిత్రల ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సదస్సు నిరర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సిబ్బంది న్యాయమైన కోర్కెలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. అనంతరం ఆరోగ్యశ్రీ సిబ్బంది తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కె.సంపత్కుమార్, నీలిమాదేవి, బుజ్జి, నాగేశ్వరరావు, కె.అప్పారావు, ఏసురత్నం, ప్రశాంత్, ఆషా, రత్నకుమార్, అరుణ్కుమార్, శ్రీలత, శ్రీను, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.