కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు నిధులు

ABN , First Publish Date - 2022-01-20T20:10:35+05:30 IST

తెలంగాణ రైతుబంధు నిధుల పంపిణీ ముమ్మరంగా జరుగుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు నిధులు

హైదరాబాద్: తెలంగాణ రైతుబంధు నిధుల పంపిణీ ముమ్మరంగా జరుగుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకూ 62.99 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.7411.52 కోట్లు జమ చేసినట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు నిధులు విడుదల చేశామన్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,69,696 మంది రైతులకు రూ.601,74,12,080 కోట్ల నిధులు పంపిణీ చేసినట్టు మంత్రి తెలిపారు. అలాగే సంగారెడ్డి జిల్లాలో 3,18,988 మంది రైతులకు రూ.370,74,52,397 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు.ఇక నాగర్ కర్నూలు జిల్లాలో  2,77,920 మంది రైతులకు రూ.367,35,27,173 కోట్ల నిధులు, ఖమ్మం జిల్లాలో  3,08,479 మంది రైతులకు రూ.356,12,83,145 కోట్ల నిధులు,

రంగారెడ్డి జిల్లాలో  2,94,972 మంది రైతులకు రూ.345,33,35,080 కోట్ల నిధులు,సిద్దిపేట జిల్లాలో 2,94,362 మంది రైతులకు రూ.310,65,93,586 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2,61,079 మంది రైతులకు రూ.309,28,13,804 కోట్ల నిధులు, వనపర్తి జిల్లాలో  1,58,994 మంది రైతులకు రూ.180,40,64,102 కోట్లు, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 33,452 మంది రైతులకు రూ.33.65 కోట్లు విడుదల చేశామన్నారు. 


రైతుబంధుతో కేసీఆర్ వ్యవసాయరంగానికి ఒక దిక్సూచిలా నిలిచారని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రైతుభీమాతో రైతుల ఆత్మబంధువు అయ్యారని అన్నారు. వ్యవసాయరంగం పట్ల కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ విధానం అవలంభించాలని మంత్రి సూచించారు. ఉపాధిహామీని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయరంగంలో కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటూ పంటలకు మద్దతుధరలను ఆయా రాష్ట్రాలను, ప్రాంతాలను బట్టి నిర్ణయించాలన్నారు.


పండించిన పంటలన్నీ కేంద్రం మద్దతుధరలకు కొనుగోలు చేయాలని, స్వామినాధన్ కమిటీ సిఫారసులను యధావిధిగా అమలు చేయాలకూడా కోరారు. పంటలకు మద్దతు ధరలు ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకోవడం శోచనీయమన్నారు. 60 శాతం మంది జనాభా ఆధారపడిన వ్యవసాయరంగం పట్ల కేంద్రప్రభుత్వ విధానం మారాలని అన్నారు. రైతులు సంతోషంగా ఉంటేనే సమాజం సంతోషంగా ఉంటుందన్నారు. కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలు, నిర్ణయాలతో రైతుల పట్ల, వ్యవసాయరంగం పట్ల ఆయా రాష్ట్రాల దృక్పధం మారుతూ వస్తున్నదని తెలిపారు. అన్నం పెట్టే అన్నదాతల కష్టాలను గుర్తించి చేయూతనందించింది కేసీఆర్ మాత్రమే ఆయన స్పష్టం చేశారు. 


Updated Date - 2022-01-20T20:10:35+05:30 IST