వాటికి మేం రెచ్చి పోయే రకంకాదు: మంత్రి Peddi reddy
ABN , First Publish Date - 2021-11-13T18:03:15+05:30 IST
టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు.
చిత్తూరు: టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. గాడిదలు, కుక్కలంటూ లోకేష్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని...వాటికి తాము రెచ్చిపోయే రకంకాదని స్పష్టం చేశారు. లోకేష్ ఎన్ని వ్యాఖ్యాలు చేసినా 17న కుప్పం మున్సిపల్ ఫలితాల అనంతరం వాటన్నింటికీ సమాధానం చెబుతామన్నారు. వారెన్ని దుర్భాషలాడినా.. రెచ్చగిట్టినా.. తమ ధ్యేయం ఒక్కటే కుప్పం ప్రజల మనసులు దోచుకోవడమే అని తెలిపారు. కుప్పం వాడవాడలా తిరిగా.. ఎక్కడా అభివృద్ది కనిపించలేదని.. కనీసం చాలా చోట్ల తాగునీటి సమస్యను వారు తీర్చ లేదని విమర్శించారు. సీఎం జగన్ రెడ్డి కుప్పంను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్థారన్నారు. అన్ని వార్డుల్లోనూ గెలుపొంది కుప్పం మున్సిపాలిటీని క్లీన్ స్వీప్ చేస్తామి మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.