కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2022-04-29T21:00:41+05:30 IST

మంత్రి కేటీఆర్ ఏపీ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి

అనంతపురం: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఏపీ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో విద్యుత్ కోతలు లేవన్నారు. బొగ్గు అధికంగా కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రోడ్లు బాగుపడ్డాయన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే కేటీఆర్ అలా మాట్లాడి ఉండొచ్చునని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో బాగాలేదు.. తెలంగాణలో బాగుందంటే ఓట్లు పడొచ్చని కేటీఆర్ భావించి ఉండవచ్చునని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.


మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు... 

ఏపీలో కరెంట్‌, నీటి సౌకర్యం లేదని, రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. ఈ విషయం ఏపీకి వెళ్లొచ్చిన తన స్నేహితులు చెబుతున్నారన్నారని, ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్లు ఉందని చెప్పారన్నారు. అనుమానం ఉంటే.. ఎవరైనా ఏపీకి వెళ్లిరండని మంత్రి కేటీఆర్ సలహా ఇచ్చారు. ఏపీతో పోలిస్తే..తెలంగాణలో రోడ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయని చెప్పారు.

Updated Date - 2022-04-29T21:00:41+05:30 IST