వైసీపీ ఓడిపోతే మా ఎంపీలందరూ రాజీనామా: పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2021-04-11T17:16:00+05:30 IST

డీపీ అధినేత చంద్రబాబు రెఫరెండం సవాల్‌ను మంత్రి పెద్దిరెడ్డి స్వీకరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో

వైసీపీ ఓడిపోతే మా ఎంపీలందరూ రాజీనామా: పెద్దిరెడ్డి

తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు రెఫరెండం సవాల్‌ను మంత్రి పెద్దిరెడ్డి స్వీకరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో వైసీపీ ఓడిపోతే తమ ఎంపీలందరూ రాజీనామా చేస్తారని చెప్పారు. టీడీపీ ఓడితే ముగ్గురు ఎంపీలతో పాటు రఘురామరాజుతో రాజీనామా చేయిస్తారా? అని ప్రశ్నించారు. కోవిడ్ వ్యాప్తి కారణంగానే సీఎం జగన్ తిరుపతి సభ రద్దు చేసుకున్నారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్ అని ఎద్దేవాచేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. బీజేపీ నేత సునీల్ దియోధర్‌కు వైసీపీని విమర్శించే అర్హత లేదని పెద్దిరెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2021-04-11T17:16:00+05:30 IST