సీఎం Jaganను కలిసిన మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ ఈవో

ABN , First Publish Date - 2022-06-20T17:54:55+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి సోమవారం ఉదయం కలిశారు.

సీఎం Jaganను కలిసిన మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ ఈవో

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy)ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddi reddy ramachandra reddy), టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి(Dharma reddy) సోమవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా తిరుపతిలోని వకుళమాత ఆలయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. ఈ నెల 23న వకుళమాత ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ నెల 18 న అంకురార్పణంతో మొదలై 23 వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలు, 23 న మహా సంప్రోక్షణ ఆవాహన, ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా సీఎం జగన్‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏ.వి.ధర్మారెడ్డి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. అనంతరం టీటీడీ వేద పండితులు స్వామివారి ప్రసాదాలు, వస్త్రాన్ని సీఎంకు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. 

Updated Date - 2022-06-20T17:54:55+05:30 IST