ఆయనకు కేంద్ర పదవులపై ఆశ..

ABN , First Publish Date - 2022-06-05T15:14:17+05:30 IST

బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అన్నామలై కేంద్ర పదవి పొందాలనే ఆశతో ఉన్నారని సహకార శాఖ మంత్రి ఐ.పెరియస్వామి అభిప్రాయపడ్డారు. దిండుగల్‌లో

ఆయనకు కేంద్ర పదవులపై ఆశ..

                         - మంత్రి పెరియస్వామి


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 4: బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అన్నామలై కేంద్ర పదవి పొందాలనే ఆశతో ఉన్నారని సహకార శాఖ మంత్రి ఐ.పెరియస్వామి అభిప్రాయపడ్డారు. దిండుగల్‌లో శనివారం జరిగిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 99వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కరుణానిధి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, డీఎం కే మంత్రుల అవినీతి చిట్కా బయటపెడతానంటూ అన్నామలై పేర్కొంటున్నారని, ఆయన బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. డీఎంకే ప్రభుత్వం అవినీతికి తావులేని పాలన అందిస్తోందన్నారు. అవినీతి జరిగిందా? లేదా? అనే విషయాన్ని న్యాయస్థానాలు నిర్ణయిస్తాయన్నారు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో పోటీచేసి 4స్థానాలు గెలుపొందారని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీచేసి విజ యం సాధించే సత్తా బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. డీఎంకే ప్రభుత్వాన్ని ఎంత విమర్శిస్తే పార్టీ అధిష్ఠానం దృష్టిలో పడి కేంద్ర పదవులు పొందాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారని, అందుకు కేంద్ర మంత్రి మురుగన్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ నిదర్శనమని మంత్రి పెరియస్వామి ఆరోపించారు.

Updated Date - 2022-06-05T15:14:17+05:30 IST