మంత్రి పేర్నినానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు భేటీ

ABN , First Publish Date - 2021-12-28T18:21:35+05:30 IST

మంత్రి పేర్నినానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం సమావేశమయ్యారు.

మంత్రి పేర్నినానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు భేటీ

అమరావతి:  మంత్రి పేర్నినానితో  సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం సమావేశమయ్యారు. సినిమా టిక్కెట్ ధరలు, థియేటర్ల ఇబ్బందులపై ప్రధానంగా చర్చించనున్నారు. 19 మంది డిస్ట్రిబ్యూటర్లు, ఎఫ్డీసీ చైర్మన్ విజయకుమార్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. 


సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. అతి తక్కువ ధరలకే సినిమా టికెట్ రేట్లను సర్కార్ నిర్ణయించింది. దీనిపై సినీ పరిశ్రమ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరకు ఈ వ్యవహారంపై సినీ పరిశ్రమ పెద్దలు కోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. సినిమా టికెట్లపై 11 మందితో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

 


Updated Date - 2021-12-28T18:21:35+05:30 IST