ఖబర్దార్.. టీఆర్ఎస్ కార్యకర్తలు మీకు తగిన బుద్ధి చెబుతారు: మంత్రి Prashanth

ABN , First Publish Date - 2022-05-10T19:54:23+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచంలోనే 10 శాతం పెంచిన వ్యక్తి కేటీఆర్ అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.

ఖబర్దార్.. టీఆర్ఎస్ కార్యకర్తలు మీకు తగిన బుద్ధి చెబుతారు: మంత్రి Prashanth

కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచంలోనే 10 శాతం పెంచిన వ్యక్తి మంత్రి కేటీఆర్(KTR) అని మంత్రి ప్రశాంత్ రెడ్డి(Prashant Reddy) అన్నారు. మంగళవారం ఉదయం బీబీ పేట మండలం కోనాపూర్‌లో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ...బీబీపేట మండలంలోని కొనాపూర్‌లో కేటీఆర్ నానమ్మ జ్ఞాపకార్థం రూ.2 కోట్లతో పాఠశాలను నిర్మించడం గర్వించదగ్గ విషయమన్నారు. వందల ఎకరాల భూములు కలిగిన కుటుంబంలో జన్మించిన వ్యక్తి కేసీఆర్(KCR) అని చెప్పుకొచ్చారు. మహబుబ్‌నగర్‌లో సున్నాలు వేసుకొనేటోడు, నిజామాబాద్‌లో చందాలు వసూలు చేసుకొనేటోడు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఖబర్దార్.. టీఆర్ఎస్ కార్యకర్తలు మీకు తగిన బుద్ధి చెబుతారు’’ అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. 

Read more