కరోనా ఉధృతిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమీక్ష

ABN , First Publish Date - 2021-04-17T21:06:40+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమీక్షించారు. శనివారం ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రెండో దశ కోవిడ్ వేగంగా వ్యాపిస్తోందని చెప్పారు.

కరోనా ఉధృతిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమీక్ష

కామారెడ్డి: జిల్లాలో కరోనా ఉధృతిపై  మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శనివారం ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రెండో దశ కోవిడ్ వేగంగా వ్యాపిస్తోందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 140 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాలో 30 వ్యాక్సినేషన్ సెంటర్లు పనిచేస్తున్నాయన్నారు. 2.3 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా ఇప్పటికే లక్ష మందికి టీకా ఇచ్చామని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల రాకపోకలపై మరింత నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఉన్నచోట తాత్కాలిక ప్రాతిపదికన.. వెంటనే నియమించుకోవాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు.

Updated Date - 2021-04-17T21:06:40+05:30 IST