తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష: మంత్రి పువ్వాడ
ABN , First Publish Date - 2021-02-27T16:44:34+05:30 IST
తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
ఖమ్మం: తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ అమ్మకి అన్నం పెట్టని వాడు చిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తా అన్న చందంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శలు గుప్పించారు. ఈ దేశంలో నిరుద్యోగం ను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూస్తోంది నిజం కాదా అని ప్రశ్నించారు. పట్టభద్రులు, విద్యా వంతులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణను పట్టి పీడించిన అనేక సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం చూపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.