బాలకృష్ణ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది: Roja
ABN , First Publish Date - 2022-05-28T19:07:53+05:30 IST
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. బాలకృష్ణ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందన్నారు.
అమరావతి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Bala krishna)పై మంత్రి రోజా(Roja) విమర్శలు గుప్పించారు. బాలకృష్ణ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందన్నారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నిమ్మకూరులో ఎన్టీఆర్ది పెద్ద విగ్రహం పెడతామంటున్నారని... బాలకృష్ణకు ఇన్నేళ్లు నిమ్మకూరు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. 2019 వరకు తమరే అధికారంలో ఉన్నారు కదా.. నిమ్మకూరును అభివృద్ధి చేయాలని అప్పుడు అనిపించలేదా? అని నిలదీశారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు.