Minister Roja: చెప్పుకుంటే బాధ అంటూ... టీటీడీపై రోజా అసహనం
ABN , First Publish Date - 2022-08-18T15:11:44+05:30 IST
తిరుమల తిరుపతి దేవస్థానంపై మంత్రి రోజా అసహనం వ్యక్తం చేశారు.
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)పై మంత్రి రోజా(Roja) అసహనం వ్యక్తం చేశారు. రోజా అడిగినప్పటికీ ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం టిక్కెట్లు జారీ చేసేందుకు టీటీడీ నిరాకరించింది. కేవలం సాధారణ బ్రేక్ టికెట్లను జారీ చెయ్యడంతో టీటీడీ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు శ్రీవారి ఆలయం (Tirumala temple)లోనే ఉండి... తన అనుచరులకు దర్శనం చేయించారు. చెప్పుకుంటే బాధ అంటూ టీటీడీపై అసహనం వ్యక్తం చేశారు. టీటీడీ నిర్ణయాన్ని గౌరవించాలి కనుక... తన నియోజకవర్గ ప్రజలకు దర్శనం అయ్యే వరకు ఆలయంలోనే ఉన్నానని మంత్రి రోజా చెప్పారు.