Challenge: మంత్రి రోజాకు పంచుమర్తి అనురాధ సవాల్
ABN , First Publish Date - 2022-08-18T19:25:20+05:30 IST
మంత్రి రోజాకు ట్విట్టర్ వేదికగా టీడీపీ నేత పంచుమర్తి అనురాధ సవాల్ విసిరారు.
విజయవాడ (Vijayawada): మంత్రి రోజా (Minister Roja)కు ట్విట్టర్ (Twitter) వేదికగా టీడీపీ నేత పంచుమర్తి అనురాధ (Anuradha) సవాల్ (Challenge) విసిరారు. ఒట్టి మాటలు కాకుండా.. ఆధారాలతో రావాలని.. బహిరంగ చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో తెచ్చిన కంపెనీలు జీవోలతో సహా ఉన్నాయన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో..అసెంబ్లీ సాక్షిగా మేకపాటి గౌతమ్రెడ్డి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ హయాంలో తెచ్చిన అన్ని కంపెనీల జీవో కాపీలతో సహా తాము చర్చకు వస్తామన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కంపెనీల జీవో కాపీలు, కల్పించిన ఉద్యోగాల వివరాలతో బహిరంగ చర్చకు మంత్రి రోజా రావాలన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని శాఖల జీవోలను ఎందుకు దాస్తోందని ప్రశ్నించారు. పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఎందుకు పెట్టడంలేదన్నారు. స్కామ్లు బయటపడతాయని జీవోలు దాస్తున్నారా? అంటూ పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు.