Minister సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‎ని అడ్డుకున్న NSUI నాయకులు

ABN , First Publish Date - 2022-06-10T18:05:31+05:30 IST

మీర్‎పేట రహదారిపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. NSUI నాయకులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‎ని

Minister సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‎ని అడ్డుకున్న NSUI నాయకులు

రంగారెడ్డి: మీర్‎పేట్ రహదారిపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. NSUI నాయకులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‎ని అడ్డుకున్నారు. టెట్ పరీక్షను వెంటనే వాయిదా వేయ్యాలని డిమాండ్ చేశారు. మీర్‎పేట్‎లో కార్యక్రమంలో మంత్రిని కలిసి వినతి పత్రాన్ని NSUI నాయకులు అందించే ప్రయత్నం చేశారు. మంత్రిని కలవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో కాన్వాయ్‎కి అడ్డుపడ్డారు. దీంతో మీర్‎పేట్‎లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా NSUI అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సహా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి మీర్‎పేట్ స్టేషన్‎కు తరలించారు.

Updated Date - 2022-06-10T18:05:31+05:30 IST