Minister: ఆలయాల్లో భక్తులకు మెరుగైన సదుపాయాలు

ABN , First Publish Date - 2022-09-15T16:08:04+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన ఆలయాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఉత్తర్వుల మేరకు భక్తులకు అదనపు వసతులు కల్పించే చర్యలు చేపట్టినట్లు హిందూ

Minister: ఆలయాల్లో భక్తులకు మెరుగైన సదుపాయాలు

                                       - మంత్రి పీకే శేఖర్‌బాబు


ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 14: రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన ఆలయాల్లో  ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఉత్తర్వుల మేరకు భక్తులకు అదనపు వసతులు కల్పించే చర్యలు చేపట్టినట్లు హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu) వెల్లడించారు.  నుంగంబాక్కంలోని దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో మంగళవారం మంత్రి శేఖర్‌బాబు అధ్యక్షతన జరిగిన  సమావేశంలో ఆ శాఖ ఉన్నతాధికారులు, ఆలయాల నిర్వాహక అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చర్చించిన ప్రధాన అంశాలపై మంత్రి శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu) మాట్లాడారు. ప్రస్తుతం ఆలయాల్లో జీర్ణోద్ధరణ పనులు సకాలంలో పూర్తిచేయాలని, భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా ఆలయ నిర్వాహక అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు మంత్రి తెలిపారు.

Updated Date - 2022-09-15T16:08:04+05:30 IST