స్వాతంత్ర్య సమరంలో బంజారాలది మహోన్నత పాత్ర: మంత్రి శ్రీనివాస్

ABN , First Publish Date - 2022-02-15T18:01:53+05:30 IST

స్వాతంత్ర్య సమరంలో బంజారాలది మహోన్నతమైన పాత్ర అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

స్వాతంత్ర్య సమరంలో బంజారాలది మహోన్నత పాత్ర: మంత్రి శ్రీనివాస్

మహబూబ్‌నగర్: స్వాతంత్ర్య సమరంలో బంజారాలది మహోన్నతమైన పాత్ర అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో సంత్ శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం గత పాలక వర్గాలు లంబడాలను పూర్తిగా విస్మరించాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత దేశంలోనే తొలిసారిగా హమారా తాండామే హమారా రాజ్ అన్న నినాదాన్ని సాకారం చేస్తూ సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని తెలిపారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని మంత్రి చెప్పారు. జిల్లా కేంద్రంలో సేవాలాల్ ఆలయ నిర్మాణానికి 1000 గజాలు కేటాయిస్తూ నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో గిరిజన మహిళా హాస్టల్, గిరిజన భవన్, గిరిజన వసతి గృహం లాంటి ఎన్నో నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో సేవాలాల్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని వెల్లడించారు. గిరిజన సంక్షేమం కోసం అజన్మాంతం శ్రమిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-02-15T18:01:53+05:30 IST