ఎంపీ రఘురామపై మంత్రి శ్రీరంగనాథరాజు తీవ్ర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-05-15T18:14:48+05:30 IST

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎంపీ రఘురామపై మంత్రి శ్రీరంగనాథరాజు తీవ్ర వ్యాఖ్యలు

ఏలూరు: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై మంత్రి  చెరుకువాడ శ్రీరంగనాథరాజు  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 14 నెలలుగా తన నియోజకవర్గ  ప్రజల కష్టాలను ఎంపీ రఘురామ కృష్ణంరాజు గాలికొదిలేసారని విమర్శించారు. రఘురామను ఈ సమయంలో అరెస్ట్ చేయడం సరికాదంటున్న ప్రతిపక్ష పార్టీలు తీరు సరికాదన్నారు. ప్రశాంతంగా ఉన్న  జిల్లాకు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక చెదపురుగులా మారారని మండిపడ్డారు. అందరూ సిగ్గుపడేలా ప్రవర్తిస్తూ తనపై కూడా ఆయన వ్యక్తిగతంగా విమర్శలు చేశారన్నారు. అందుకే నరసాపురం ఎంపీపై తాను కూడా కేసు పెట్టానని తెలిపారు. ప్రజల మనోభావాలు ఆచారాలు రఘురామకృష్ణంరాజు తెలీదన్నారు. అలాంటి వారికి ఈ అరెస్టు ఒక గుణపాఠంకావాలన్నారు. ముఖ్యమంత్రిపై నుండి సమీక్షించాలని... అంతే గాని ప్రజల్లోకి వస్తే సమస్య పరిష్కారం అవ్వదని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. 

Updated Date - 2021-05-15T18:14:48+05:30 IST