‘నీట్‌’ మినహాయింపు తీర్మానంపై సమగ్ర నివేదిక

ABN , First Publish Date - 2022-07-21T13:37:17+05:30 IST

నీట్‌’ మినహాయింపు తీర్మానంపై కేంద్రప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. రాయపురంలో

‘నీట్‌’ మినహాయింపు తీర్మానంపై సమగ్ర నివేదిక

                               - మంత్రి ఎం.సుబ్రమణ్యం


పెరంబూర్‌(చెన్నై), జూలై 20: ‘నీట్‌’ మినహాయింపు తీర్మానంపై కేంద్రప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. రాయపురంలోని ప్రభుత్వ స్టాన్లీ వైద్యకళాశాల ఆస్పత్రిలో నిర్వహించిన జాతీయ ప్లాస్టిక్‌ సర్జరీ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, నీట్‌ మినహాయింపు తీర్మానం గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతికి పంపించారని తెలిపారు. గవర్నర్‌ ద్వారా రాష్ట్ర న్యాయశాఖకు కేంద్రప్రభుత్వం పంపిన లేఖ ప్రకారం, నీట్‌ మెరిట్‌ ఆధారిత పరీక్ష, ఇది జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకమా? అని ప్రశ్నించిందని తెలిపారు. కేంద్రప్రభుత్వ రెండు శాఖల ద్వారా అడిగిన ప్రశ్నలకు సమగ్రమైన నివేదిక అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రప్రభుత్వాలకు  అధికారం ఉంది అని కేంద్రప్రభుత్వానికి తెలియజేయనున్నామని, నీట్‌ నుంచి మినహాయింపు పొందడమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-21T13:37:17+05:30 IST