Minister: వచ్చే నెలలో 4 వారాలూ వ్యాక్సిన్ డ్రైవ్
ABN , First Publish Date - 2022-08-26T16:22:08+05:30 IST
కరోనా రహిత రాష్ట్రంగా చేసే చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిరంతరాయంగా కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా వ
- మంత్రి సుబ్రహ్మణ్యం
అడయార్(చెన్నై), ఆగస్టు 25: కరోనా రహిత రాష్ట్రంగా చేసే చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిరంతరాయంగా కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా వచ్చే నెలలోని నాలుగు వారాల్లో వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించనున్నట్టు ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రహ్మణ్యం(Health Minister M. Subrahmanyam) తెలిపారు. సైదాపేటలోని జయగోపాల్ కరోడియా ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినిలకు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఇందులో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. సెప్టెంబరు 30 తరువాత కరోనా బూస్టర్ డోస్ ఇవ్వడాన్ని కేంద్రం పూర్తిగా నిలిపివేయనుందన్నారు. ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బు చెల్లించి బూస్టర్ డోస్ వేసుకోవాల్సి ఉంటుందన్నారు. అందువల్ల ప్రజలు బూస్టర్ డోస్(Booster dose) వేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.