Minister: ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రుల్లో ‘క్యాత్ల్యాబ్’
ABN , First Publish Date - 2022-09-21T13:37:20+05:30 IST
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రులన్నింటిలోనూ త్వరలో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి
- మంత్రి సుబ్రమణ్యం
చెన్నై, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రులన్నింటిలోనూ త్వరలో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Health Minister M. Subramaniam) తెలిపారు. మంగళవారం ఉదయం సీఎం సమగ్ర వైద్యబీమా పథకం అమలుపై హృద్రోగ శస్త్రచికిత్స నిపుణులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని 39 ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రుల్లో రూ.4.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్లతో క్యాత్ లేబ్లను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు.