లోకేశ్ అజ్ఞాని: మంత్రి సురేశ్
ABN , First Publish Date - 2021-04-23T10:13:12+05:30 IST
‘‘విద్యార్థులు ఇప్పటికే ఓ ఏడాది నష్టపోయారు. మళ్లీ ఆ నష్టం కలగకూడదనే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షలు నిర్వహిస్తే 70లక్షల మందికి కరోనా వ్యాప్తి చెందుతుందని
‘‘విద్యార్థులు ఇప్పటికే ఓ ఏడాది నష్టపోయారు. మళ్లీ ఆ నష్టం కలగకూడదనే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షలు నిర్వహిస్తే 70లక్షల మందికి కరోనా వ్యాప్తి చెందుతుందని లోకేశ్... విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అపోహలు సృష్టిస్తున్నారు. చదువు విలువ తెలియవారే అలా మాట్లాడతారు’’ అని విద్యా మంత్రి ఆదిమూలపు సురేశ్ విమర్శించారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచేలా సీఎం చర్యలు తీసుకుంటుంటే లోకేశ్ అవాకులు చెవాకులు పేలుతున్నాడన్నారు.
సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయంగా ఉన్నాయన్నారు. లోకేశ్, తాను అజ్ఞానినని రుజువు చేసుకున్నాడన్నారు. మంత్రి ప్రకటనపై లోకేశ్ సాయంత్రం స్పందించారు. ‘ఇది పంతాలు, పట్టింపులకు సమయం కాదు. నన్ను మరో అరగంట తిట్టండి ఫర్వాలేదు. కాని పరీక్షలు రద్దు చేసి వారిని కాపాడండి’ అని లోకేశ్ పేర్కొన్నారు.