ఎమ్మెల్సీలతో మంత్రి సురేష్ సమావేశం

ABN , First Publish Date - 2021-08-03T21:28:10+05:30 IST

టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమావేశమయ్యారు. సచివాలయం

ఎమ్మెల్సీలతో మంత్రి సురేష్ సమావేశం

అమరావతి: టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమావేశమయ్యారు. సచివాలయం 5వ బ్లాక్‌లో సమావేశం జరుగుతోంది. జాతీయ విద్యావిధానం అమలుపై ఎమ్మెల్సీల అభిప్రాయాలు, సూచనలు మంత్రి తీసుకున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్టతకు సీఎం జగన్‌ తీసుకుంటున్న చర్యలు... అమలవుతున్న పధకాలను ఎమ్మెల్సీలు ఆభినందించినట్లు సమాచారం. జాతీయ విద్యావిధానం అమలుపై  ఎమ్మెల్సీలు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సమావేశంలో శాసనమండలి ప్రొటెమ్ చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, డైరెక్టర్ చిన్నవీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-03T21:28:10+05:30 IST