ఉచిత మధ్యాహ్న భోజన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని

ABN , First Publish Date - 2022-04-06T20:32:46+05:30 IST

సమాజ సేవతోనే మానవ జీవితానికి సార్ధకత లభిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

ఉచిత మధ్యాహ్న భోజన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని

హైదరాబాద్: సమాజ సేవతోనే మానవ జీవితానికి సార్ధకత లభిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అమీర్ పేట డివిజన్ లోని బికె గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న మిత బోజన కేంద్రం, చలివేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మాట్లాడుతూ 2011 సంవత్సరంలో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం వేసవి కాలంలో 2 నెలల పాటు మధ్యాహ్నం భోజనం అందించడం ఎంతో సంతోషదాయకం అని నిర్వహకులను అభినందించారు. గత రెండు సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి కారణంగా ఏర్పాటు చేయలేకపోయామని నిర్వహకులు పార్ధ సారధి మంత్రికి వివరించారు. 


ఎంతో మంది ఆకలిని తీర్చే ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్న సీనియర్ సిటిజన్స్ సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి తన వంతు సాయంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ 2 లక్షల రూపాయలను శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పార్ధసారధికి అందజేశారు. ముందుగా సీనియర్ సిటిజన్ సభ్యులు నరసింహ గౌడ్ మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అదేవిధంగా గత 11 సంవత్సరాల నుండి చలివేంద్రం ఏర్పాటుకు సహకరిస్తున్న డాక్టర్ శ్యామసుందర్ రాజ్దంపతులను మంత్రి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ట్రస్టీ సభ్యులు కృష్ణారెడ్డి, విటల్ రెడ్డి, రామమూర్తి, BKM సత్యనారాయణ, సీనియర్ సిటిజన్ సభ్యులు సహదేవ్ గౌడ్, సాయి, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-06T20:32:46+05:30 IST