అవయవదాతలు దేవుడితో సమానం: తలసాని

ABN , First Publish Date - 2022-04-23T20:32:55+05:30 IST

అవయవదానంతో మరొకరికి పునర్జన్మ నిచ్చిన దాతలు దేవుడితో సమానమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అన్నారు

అవయవదాతలు దేవుడితో సమానం: తలసాని

హైదరాబాద్: అవయవదానంతో మరొకరికి పునర్జన్మ నిచ్చిన దాతలు దేవుడితో సమానమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అన్నారు. శనివారం రవీంద్ర భారతిలో జీవన్ దాన్ ఆధ్వర్యంలో ఆర్గాన్స్ డోనర్స్ కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ అవయవదానం చేసి అనేకమంది ప్రాణాలు కాపాడిన అవయవదాతల ను స్మరించుకోవాలన్నారు.అవయవదానం తో 3800 మంది పునర్జన్మ పొందారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్యసేవలు ఎంతో అభివృద్ధి చేసినట్టు తెలిపారు.ప్రభుత్వ హాస్పిటల్స్ కు వైద్యం కోసం ఎంతో ధైర్యంగా వెళ్లేలా ప్రజలకు నమ్మకం కలిగించామన్నారు.కోట్లాది రూపాయల వ్యయంతో ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్స్ లో అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంచిన ఘనత కూడా సీఎం కేసీఆర్ దేనని మంత్రి తలసాని పేర్కొన్నారు. 


Updated Date - 2022-04-23T20:32:55+05:30 IST