అమెరికాలో జరిగే తెలుగు అసోసియేషన్ సభలకు తలసానికి ఆహ్వానం

ABN , First Publish Date - 2022-05-02T22:45:39+05:30 IST

వాషింగ్టన్ లో జులై నెలలో నిర్వహించే అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు.

అమెరికాలో జరిగే తెలుగు అసోసియేషన్ సభలకు తలసానికి ఆహ్వానం

హైదరాబాద్: వాషింగ్టన్ లో జులై నెలలో నిర్వహించే అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు సోమవారం అసోసియేషన్ ప్రతినిధులు సత్యనారాయణ రెడ్డి, వెంకట్ రెడ్డి, కృష్ణ మాసాబ్ టాంక్ లోని తన కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆటా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంతో అమెరికాలోని తెలుగు వారిని అందరిని ఒకేచోట కలుసుకుంటారని, ఆ సందర్భం ఓ మధురానుభూతి అన్నారు.


మన, సంస్కృతిని తెలియజేసే విధంగా సంబరాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాల నుండి వేడుకలు నిర్వహించలేకపోయారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం జులై 1, 2, 3 తేదీలలో ఆటా వేడుకలను నిర్వహించే వేడుకలకు తప్పక హాజరు కావాలని మంత్రిని ఆటా ప్రతినిధులు కోరారు.

Read more