ఆశావర్కర్లకు మొబైల్ ఫోన్ లను పంపిణీ చేసిన మంత్రి తలసాని

ABN , First Publish Date - 2022-02-20T19:58:42+05:30 IST

ఆశా వర్కర్ల సేవలు వెలకట్టలేనివని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

ఆశావర్కర్లకు మొబైల్ ఫోన్ లను పంపిణీ చేసిన మంత్రి తలసాని

హైదరాబాద్: ఆశా వర్కర్ల సేవలు వెలకట్టలేనివని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరోనా సమయంలో వారు అందించిన సేవలు మరువలేనివని ప్రశంసించారు. ఆదివారం ఆశా వర్కర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రకమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకరోనా కష్ట సమయంలో  కూడా ఎంతో ధైర్య సాహసాలతో పని చేసిన ఆశావర్కర్లకు ఏం చేసినా తక్కువేనని అన్నారు.ఆశా వర్కర్ ల కష్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి వేతనాలు పెంచారని చెప్పారు.ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ కోసమే ఆశ వర్కర్ లకు మొబైల్ ఫోన్ ల పంపిణీ చేసినట్టు మంత్రి తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 1385 మంది ఆశ వర్కర్లు పనిచేస్తున్నారని, వారి సేవలను ప్రభుత్వం పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 

Updated Date - 2022-02-20T19:58:42+05:30 IST