దళితుల సంక్షేమానికి కృషిచేసిన మంచివ్యక్తి ఎల్లయ్య- తలసాని
ABN , First Publish Date - 2020-08-08T20:42:15+05:30 IST
దళితుల సంక్షేమానికి నిరంతరం పాటుపడిన మంచి వ్యక్తి మాజీ ఎంపి నంది ఎల్లయ్య అని పశుసంవర్దకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
హైదరాబాద్: దళితుల సంక్షేమానికి నిరంతరం పాటుపడిన మంచి వ్యక్తి మాజీ ఎంపి నంది ఎల్లయ్య అని పశుసంవర్దకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సీనియర్నాయకుడిగా, దళిత,బలహీన వర్గాలనేతగా నంది ఎల్లయ్య రాజకీయాల్లో నిజాయితీ గల నేతగా ఎదిగారని అన్నారు. నంది ఎల్లయ్య సుదీర్ఘ కాలం పాటురాజకీయాల్లో ఉంటూ పేదలు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజల మనిషిగా తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్నారని చెప్పారు. అనారోగ్యంతో మృతి చెందిన ఎల్లయ్య కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.