బీజేపీకి చెంప చెల్లుమనిపించారు: తలసాని

ABN , First Publish Date - 2021-03-20T23:53:01+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీకి గ్రాడ్యుయేట్లు చెంప చెల్లుమనిపించారని

బీజేపీకి చెంప చెల్లుమనిపించారు: తలసాని

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీకి గ్రాడ్యుయేట్లు చెంప చెల్లుమనిపించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించడం పై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవికి గ్రాడ్యుయేట్లు ఓటేశారని ఆయన పేర్కొన్నారు.


రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని, అందుకే టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి వాణీదేవిని గెలిపించారని మంత్రి తలసాని అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్లు, బీజేపీకి చెంప చెల్లుమనిపించారని ఆయన పేర్కొన్నారు. ఈ ఓటమితో బీజేపీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని వారికి తలసాని సూచించారు. అంతేకాకుండా గతంలో చిన్నారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు గుడ్డి గుర్రాల పళ్లు తోమారా అని తలసాని ప్రశ్నించారు. 

Updated Date - 2021-03-20T23:53:01+05:30 IST