రంజాన్ పండగ కోసం ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు: తలసాని

ABN , First Publish Date - 2022-03-16T20:22:37+05:30 IST

ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ కు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు

రంజాన్ పండగ కోసం ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు: తలసాని

హైదరాబాద్: ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ కు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం అన్ని వర్గాల పండగలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.రంజాన్ పండుగ ఏర్పాట్ల పై డిఎస్ఎస్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లుడుతూతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రతి సంవత్సరం రంజాన్ ను ఘనంగా జరుపుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. నిరుపేదలు సైతం పండుగ ను సంతోషంగా జరుపుకోవాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ఆలోచన అన్నారు. ఈమేరకు నూతన దుస్తుల గిఫ్ట్ ప్యాకెట్ లను కూడా ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాగే మసీదుల్లో ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందులకు సైతం ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.


మత సామరస్యంతో అన్ని వర్గాల ప్రజలుకలిసి మెలసి జీవిస్తున్న తెలంగాణలో ప్రతి ఏటా రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఆయాశాఖల సమన్వయంతో రంజాన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో పాటు హోంమంత్రి మహమూద్అలీ, ఎస్సీ,మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-16T20:22:37+05:30 IST