వైసీపీ నేతలకు మంత్రి తలసాని స్ట్రాంగ్ కౌంటర్
ABN , First Publish Date - 2022-04-30T18:01:07+05:30 IST
ఏపీ వైసీపీ నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్: ఏపీ వైసీపీ నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ నేతలు కావాలనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని కాకుండా ప్రపంచ దేశాలు హైదరాబాద్లో ఇన్వెస్ట్ పెడుతున్నాయని తెలిపారు. కేటీఆర్ వ్యాఖ్యలకు అనవసరంగా వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారని అన్నారు. ఏపీ నేతలు ప్రతిపక్ష నాయకుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీని తమ కంటే అభివృద్ధి చేస్తే సంతోషమన్నారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అర్థ రహితమని తెలిపారు. బొత్స హైదరాబాద్ వస్తే ఎప్పుడు జనరేటర్ వినియోగించారో చెప్పాలన్నారు. ఏపీలో పవర్ కట్పై వాళ్ళే బహిరంగంగా ప్రకటించుకున్నారని అన్నారు. వైసీపీ నేతల మాటలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేతలు పద్ధతి తప్పి మాట్లాడటం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.