అపోలో ఆస్పత్రికి మంత్రి తలసాని... విద్యార్థులకు పరామర్శ

ABN , First Publish Date - 2022-08-18T19:34:02+05:30 IST

బంజారాహిల్స్‌లోని ఆర్కే సినీ మ్యాక్స్ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు.

అపోలో ఆస్పత్రికి మంత్రి తలసాని... విద్యార్థులకు పరామర్శ

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఆర్కే సినీ మ్యాక్స్ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani srinivas yadav) పరామర్శించారు. గురువారం అపోలో హాస్పిటల్ చేరుకున్న మంత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ విద్యాభవన్ స్కూల్ (Bharatiya vidya bhavan school) విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... అపోలో హాస్పిటల్‌కు మొత్తం 13 మంది విద్యార్థులు వచ్చారని... అందులో 9 మంది విద్యార్థులు చికిత్స అనంతరం క్షేమంగా ఇంటికి వెళ్లిపోయారని తెలిపారు. ప్రస్తుతం మరో నలుగురు విద్యార్థులు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాహాని లేదన్నారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. పిల్లలు ఎస్కలేరటర్‌పై ఉత్సాహంగా వెళ్ళడంతో.. అనుకోకుండా ఎస్కలెటర్‌పై ఒకరు కింద పడడంతో వెనువెంటనే మరి కొంత మంది కింద పడ్డారని అన్నారు. ప్రస్తుతం పిల్లలతో పాటు టీచర్ కూడా చికిత్స పొందుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

Updated Date - 2022-08-18T19:34:02+05:30 IST