గవర్నర్‌పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-04-20T17:06:35+05:30 IST

రాష్ట్ర గవర్నర్ తమిళిసైపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గవర్నర్‌పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసైపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్‌మీట్లు పెట్టి నిందించటం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు తమవని... నామినేటెడ్ వ్యక్తులు కాదని తెలిపారు. రాజకీయ పార్టీల వ్యక్తిలా మాట్లాడటం మంచిది కాదని అన్నారు. ఈ ముఖ్యమంత్రితో పనిచేయటం ఇష్టం లేదు అని చెప్పటం సరికాదన్నారు. ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదని తెలిపారు. గవర్నర్ రాజకీయ పరమైన మాటలు మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వంపైన ఆరోపణలు సరికాదని అన్నారు. ‘‘ఉపరాష్ట్రపతి, గవర్నర్ అనే పాత్ర చాలా తక్కువ... గవర్నర్‌గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి’’ అంటూ హితవుపలికారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వారే ప్రోటోకాల్ విషయంలో కొన్ని రెస్ట్రక్షన్స్ ఉంటాయి అన్నారని... అది కూడా గవర్నర్ తెలుసుకొని మాట్లాడాలని తెలిపారు. రాజ్యాంగ పరమైన విధానంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు పని పాట లేదని మండిపడ్డారు. పొద్దున లేస్తే సోషల్ మీడియా లో ప్రచారం తప్ప  వేరే లేదంటూ మంత్రి తలసాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-04-20T17:06:35+05:30 IST