కళ్యాణదుర్గంలో చిన్నారి మృతిపై మంత్రి ఉషశ్రీ స్పందన
ABN , First Publish Date - 2022-04-18T18:12:47+05:30 IST
కళ్యాణదుర్గంలో చిన్నారి మృతి పట్ల మంత్రి ఉషశ్రీ చరణ్ ఎట్టకేలకు స్పందించారు.
అనంతపురం: కళ్యాణదుర్గంలో చిన్నారి మృతి పట్ల మంత్రి ఉషశ్రీ చరణ్ ఎట్టకేలకు స్పందించారు. కళ్యాణదుర్గంలో ఏమి జరిగిందో ఎస్పీ కళ్లకు కట్టినట్లు వివరించారన్నారు. కళ్యాణదుర్గం టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్గా ఓసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలో వైసీపీ ప్రభంజనానికి భయపడి అక్కడి ఇంచార్జ్ శిశువుతో శవ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. శవ రాజకీయం చేస్తున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని.. వారిని ఆంజనేయస్వామి చూసుకుంటాడని తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సోమవారం ఉదయం కసాపురం ఆంజనేయస్వామిని మంత్రి ఉషశ్రీ చరణ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. పూజల్లో కూర్చున్న మంత్రి ఉషశ్రీచరణ్ దంపతులపై వానరం కూర్చోవడంతో మంత్రి దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.