అనంతపురం వైసీపీలో విభేదాలు.. ఎవరి దారి వారిదే..!

ABN , First Publish Date - 2022-04-19T23:43:52+05:30 IST

వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యమేళా కార్యక్రమానికి మంత్రి ఉషశ్రీచరణ్ హాజరుకాలేదు. దీంతో నిరీక్షించిన అనంతపురం ఎంపీ తలారి రంగయ్య వెనుదిరిగి వెళ్లిపోయారు....

అనంతపురం వైసీపీలో విభేదాలు.. ఎవరి దారి వారిదే..!

అనంతపురం: వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యమేళా కార్యక్రమానికి మంత్రి ఉషశ్రీచరణ్ హాజరుకాలేదు. దీంతో నిరీక్షించిన అనంతపురం ఎంపీ తలారి రంగయ్య వెనుదిరిగి వెళ్లిపోయారు. మంత్రి రాక కోసం ఎదురు చూసి కార్యక్రమం మొత్తం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ముభావంగా ఉన్నారు. వెయిటింగ్ హాల్లో కూర్చన్న మంత్రిని  వెంకట్రామిరెడ్డి పిలుచుకు వచ్చారు. రిబ్బన్ కట్ చేయాలంటూ అనంత వెంకట్రామిరెడ్డిని మంత్రి ఉషశ్రీ చరణ్ కోరగా ఆయన తిరస్కరించారు. మరోవైపు రిబ్బన్ కటింగ్ అనంతరం కార్యక్రమంలో హాజరుకాకుండా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వెనుతిరిగి వెళ్లిపోయారు. 



Updated Date - 2022-04-19T23:43:52+05:30 IST