వైసీపీ పాలనలో పూర్తిస్థాయిలో రాష్ట్రాభివృద్ధి

ABN , First Publish Date - 2021-10-18T04:45:16+05:30 IST

గండేపల్లి, అక్టోబరు 17: వైసీపీ పాలనలో పూర్తిస్థాయిలో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని దేవదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని నీలాద్రిపేట గ్రామ శివారులో పరిణయ ఫంక్షన్‌హాల్లో ఆదివారం జగ్గంపేట మండల ఎంపీపీగా అత్తులూరి నాగబాబుకు ఆర్యవైశ్య సంఘ నాయకు

వైసీపీ పాలనలో పూర్తిస్థాయిలో రాష్ట్రాభివృద్ధి
నీలాద్రిపేటలో మాట్లాడుతున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

గండేపల్లి, అక్టోబరు 17: వైసీపీ పాలనలో పూర్తిస్థాయిలో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని దేవదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని నీలాద్రిపేట గ్రామ శివారులో పరిణయ ఫంక్షన్‌హాల్లో ఆదివారం జగ్గంపేట మండల ఎంపీపీగా అత్తులూరి నాగబాబుకు ఆర్యవైశ్య సంఘ నాయకులు చేపట్టిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీనివాస్‌, కాకినాడ ఎంపీ గీత, జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు హాజరయ్యారు. ముందుగా నాగబాబు దంపతులకు గజమాల వేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం జగన్‌ ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి బడుగుబలహీన వర్గాలను ఆదుకుంటున్నారన్నారు. కులమతాలకతీతంగా అన్ని వర్గాలకు పార్టీలో సముచిత స్థానం కల్పించారన్నారు. రాష్ట్రాభివృద్ధి చూడలేక ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఎంపీ గీత, ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా సీఎం జగన్‌ నిధులు విడుదల చేసి మహిళల స్వయం ఉపాధికి తోడ్పడుతున్నారన్నారు. ప్రజా సంక్షేమం కోసం మరెన్నో పథకాలు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో జగ్గంపేట జడ్పీటీసీ ఒమ్మి బిందుమాధవి రఘురాం, ఉప సర్పంచ్‌ బండారు రాజా, గండేపల్లి ఎంపీపీ చల్లగల్ల దొరబాబు, అడబాల ఆంజనేయులు, గండేపల్లి మురారి ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T04:45:16+05:30 IST