బీజేపీకి ఎక్కడా డిపాజిట్లు దక్కవు: మంత్రి Vellampalli
ABN , First Publish Date - 2021-12-29T18:17:05+05:30 IST
రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కవని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
విజయవాడ: రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కవని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ అంతర్వేది రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ విచారణకు బీజేపీ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని ఉద్దేశంతోనే బీజేపీ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. సీఎం రమేష్, సుజనా చౌదరిలు ఏపీ బీజేపీని నడుపుతున్నారన్నారు. బీజేపీ ఏంచేస్తుందో చెప్పకుండా సోము వీర్రాజు మద్యం గురించి మాట్లాడతారని మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలు చేశారు.