మత రాజకీయాలు చేస్తే సహించం: మంత్రి వెల్లంపల్లి
ABN , First Publish Date - 2022-01-23T00:29:57+05:30 IST
రాష్ట్రంలో హిందూ ముసుగులో మత రాజకీయాలు చేస్తే సహించబోమని
అమరావతి: రాష్ట్రంలో హిందూ ముసుగులో మత రాజకీయాలు చేస్తే సహించబోమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. కులమతాలకు అతీతంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం రమేష్, సుజనాచౌదరికి బినామీలుగా ఉన్నవారే జగన్ని విమర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు కొందరు బీజేపీ వలస పక్షులు అమ్ముడు పోయారని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి సోము వీర్రాజు, సీఎం రమేష్, సుజనాచౌదరి చీడ పురుగులాంటివారని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర అభివృద్ధికి మీరు కేంద్రంతో ఏనాడైనా మాట్లాడారా అని అయన నిలదీశారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి కరోనా లాంటి వ్యక్తి అని ఆయన అన్నారు. గుడివాడలో ఏం జరిగిందని నిజ నిర్దారణ కమిటీని వేశారని ఆయన ప్రశ్నించారు. కొడాలి నాని చేసిన సవాల్ని దమ్ముంటే స్వీకరించాలని టీడీపీ నాయకులకు ఆయన సవాల్ విసిరారు.